Friday, August 7, 2015

ఫండిత నేమాని

                  అందరికీ నమస్కారము.   నా పేరు నేమాని నందకిశోర్.  ఫండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారి రెండవ అబ్బాయిని.  ఈ బ్లాగర్ పేజీని, సుమారు 8 సంవత్సరాల క్రితం మొదలు పెట్టేను.   దీని ముఖ్య ఉద్దేశ్యం మా నాన్నగారి కవిత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచన.  అనుకున్నాను కానీ, ఇంతకాలం బ్లాగులు ఏమీ రాయలేదు.  జనన మరణాలు మన చేతిలో ఉండవు.  "జాతస్యహి ధృవో మృత్యుః".  పుట్టిన ప్రతీ ప్రాణికీ మరణము తప్పదు.  నేటికి సరిగ్గా సంవత్సరము క్రితం మా నాన్నగారు శివైక్యం చెందేరు.  నాన్నగారికి అపారమైన సాహిత్య పటిమ, ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నాయి.  ఆయన 25 అష్టావధానములు, ఎన్నో కవితలు, శతకములు రచించేరు.  భారత దేశంలోనే కాక, అమెరికా, ఇంగ్లాండు దేశాలలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేరు.  ఎవరికైనా తల్లి తండృలు లేని లోటు తీర్చలేనిది.  అలాంటిది ఇంత గొప్ప కవి, ఆత్మ జ్ఞానస్వరూపులు అయినటువంటి మా నాన్నగారు లేని లోటు, ఏనాటికీ తీర్చలేనిది.  మా హృదయ ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

             నాన్నగారి రచనలను కొన్నింటిని ఈ బ్లాగులో ఉంచుతాను.   తెలుగు సాహిత్యాభిమానులు, ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసులు నాన్నగారి రచనలను చదువుతారు అని ఆశిస్తున్నాను.



No comments: